యాప్నగరం

టీనేజ్ యువతి కిడ్నాప్, అత్యాచారం.. పశ్చిమ గోదావరిలో దారుణం

టీనేజ్ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 7 Oct 2020, 11:17 am
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. టీనేజ్ యువతి(17)ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి గత నెల 21న కిడ్నాప్‌కి గురైంది. ఆమెను తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


పదిహేను రోజుల అనంతరం గ్రామానికి చేరుకున్న యువతి ఈ మేరకు సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారం, ఆమె మైనర్ కావడంతో పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిడదవోలు సీఐ విచారణ జరుపుతున్నారు.

Also Read:
మహిళా ఉద్యోగిపై అత్యాచారం! ట్రాన్స్‌ఫర్ చేయిస్తానంటూ దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.