యాప్నగరం

యువతి అనుమానాస్పద మృతి.. గుంటూరులో మిస్టరీగా మరణం

యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 6 Sep 2020, 9:17 pm
గుంటూరు జిల్లాలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి ఏరియాకి చెందిన యువతి చాందిని(18) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. అయితే యువతి మరణంపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu మృతి చెందిన చాందిని
suicide


యువతికి గతంలో లవ్ ఎఫైర్ ఉందని.. ఆమె తన ప్రియుడితో ఇంటి నుంచి వెళ్లిపోయి కొద్దికాలం తర్వాత ఇంటికి తిరిగివచ్చినట్లు సమాచారం. ఆమె సోదరుడు సైకోలా ప్రవర్తిస్తుంటాడని.. అతనికి సోదరి చాందినితో పడేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడూ గొడవపడుతుండేవాడని.. దానికి తోడు ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం కూడా ఆమె ఆత్మహత్యపై అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. పోలీసు విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది.

Read Also: ఓనర్ రేప్ వీడియో లీక్ చేసిన డ్రైవర్.. సిగ్గుతో చచ్చిపోయిన బాధితురాలు.!

Also Read: మందు తాగి భర్తని పొడిచేసిన లేడీ డాక్టర్.. హైదరాబాద్‌లో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.