యాప్నగరం

అగ్నిప్రమాదంలో 19మంది సజీవ దహనం

చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరో 8మందిని సహాయ సిబ్బంది రక్షించారు.

Samayam Telugu 30 Sep 2019, 2:58 pm
బస్సు ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే చైనాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఝేజియాంగ్ రాష్ట్రంలోని నింఘాయ్ ప్రాంతంలో గల ఓ నిత్యావసరాల తయారీ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19మంది సజీవదహనం కాగా... ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఎనిమిది మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
Samayam Telugu china


అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. చైనా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అత్యంత నాసిరకంగా ఉండటం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జియాంగ్సూ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36మంది దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరగడంతో చైనాలో విషాదం నెలకొంది.

చైనా ఫ్యాక్టరీల్లో ఇటీవల జరిగిన ప్రమాదాలు
ఏప్రిల్‌లో షాద్‌డోగ్ ప్రావిన్స్‌లోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

మార్చి నెలలో ఝియాంగ్సు ప్రావిన్స్‌లోని తుక్కు కర్మాగారంలో జరిగిన పేలుడుకు ఏడుగురు బలయ్యారు.

మార్చి 30న షాన్‌డోగ్ ప్రావిన్స్‌లో గల ఓ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

మార్చి 22వ యాన్‌చెంగ్ నగరంలోని పురుగుల మందు తయారీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో 78 మంది చనిపోగా.. 600 మందికి పైగా గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.