యాప్నగరం

విశాఖలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు

వైజాగ్‌ నగరంలో మంగళవారం రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.

Samayam Telugu 24 Jul 2020, 9:56 am
విశాఖ నగరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో దత్తత కోసం ఓ బిడ్డ కావాలని బాబామెట్టకు చెందిన పటాన్‌ సల్మాన్‌ఖాన్‌ (19), షేక్‌ సుబానీ (19), బండారు రోషన్‌బాబుకు చెప్పింది. దీంతో వారు ముగ్గురు ఈ నెల 21వ తేదీ రాత్రి ఆటోలో విశాఖ వచ్చారు.
Samayam Telugu Image


Also Read: పెళ్లి పేరుతో బాలిక కిడ్నాప్.. హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అరెస్ట్

బస్టాండ్ వద్ద హైదరాబాద్‌ ఇరానీ టీ సెంటర్‌ సమీపంలో నిద్రిస్తున్న యాచకులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవానీ దంపతుల కుమారుడు రెండేళ్ల గణేష్‌ను చూసి కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటాక 12.30 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న గణేష్‌ను అపహరించారు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన దంపతులు పక్కలో పిల్లాడు లేకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో 22వ తేదీ ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: సరుకుల కోసం వచ్చిన బాలికపై షాపు యజమాని అత్యాచారం

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. పిల్లాడిని ఆటోలో తీసుకెళ్తున్నట్లు గమనించి దాని నంబర్ ప్లేట్ ఆధారం దర్యాప్తు చేపట్టారు. ఆటో విజయనగరంలోని బాబామెట్టకు చెందిన వ్యక్తిదని తేలడంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి బిడ్డతో పాటు నిందితులను పట్టుకున్నారు. చాకచక్యంగా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులను వైజాగ్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అభినందించారు.

Also Read: సైకోలా మారిన ప్రియుడు.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.