యాప్నగరం

అనంతపురంలో యువతి కిడ్నాప్.. బలవంతంగా కారులోకి ఎక్కించి.!

కారులో వచ్చిన దుండగులు టైలర్ వద్దకు వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేశారు. కానిస్టేబుల్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.

Samayam Telugu 3 Nov 2020, 2:08 pm
అనంతపురంలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నగరంలోని ఆజాద్ నగర్‌కి చెందిన యువతి(22) అపహరణకు గురైంది. కారులో వచ్చిన దుండగులు యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆజాద్ నగర్‌ ఆరో రోడ్డుకి చెందిన కార్పెంటర్ కూతురు(22)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన యువకుడితో గతంలో వివాహం నిశ్చయించారు. అతను అవుకు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kidnap


అయితే ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహం రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం యువతి మరో మహిళతో కలసి టైలర్ వద్దకు బయలుదేరింది. ఆ సమయంలో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యులు చేపట్టాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

Also Read: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఇంటి బయట తాళం వేసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.