యాప్నగరం

కన్నకొడుకు దారుణ హత్య.. గుంటూరులో ఘోరం

క్షణికావేశంలో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. సొంతవాళ్లని సైతం హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు. కన్నకొడుకుని దారుణంగా నరికి చంపిన ఘటన గుంటూరులో జరిగింది.

Samayam Telugu 5 Dec 2020, 10:02 pm
గుంటూరులో ఘోరం చోటుచేసుకుంది. కన్నకొడుకుని తండ్రే అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన జరిగింది. జిల్లాలోని క్రోసూరు మండలం పారుపల్లికి చెందిన బాజిబాబు(22) కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రీకొడుకుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన తండ్రి కన్నకొడుకుని కిరాతకంగా నరికి చంపాడు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో బాజిబాబు మృతి చెందాడు.
Samayam Telugu తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన కొడుకు
guntur murder


మద్యం తాగే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కొడుకులని అద్దెకిస్తున్న తల్లిదండ్రులు.. నెలకి రూ.లక్ష.. దిమ్మతిరిగే దందా!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.