యాప్నగరం

కారులో వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌ని చంపిన దుండగులు.. పెద్దపల్లిలో దారుణం

పాతికేళ్ల యువకుడిని కత్తులతో నరికి కిరాతకంగా హతమార్చారు. మహిళతో వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

Samayam Telugu 18 Dec 2020, 6:16 pm
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న యువకుడిని గుర్తు తెలియని దుండగులు అమానుషంగా చంపేశారు. కత్తులతో వెంటపడి నరికి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన అంతర్గాం మండలం మద్దిరాల శివారులో జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలానికి చెందిన సందెల రమేష్ మద్దిరాల గ్రామ శివారులోని పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా కొందరు దుండగులు కారులో వచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అమాంతం కత్తులతో దాడి చేశారు. రమేష్ తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి మెడ, తలపై దారుణంగా నరికారు. తీవ్రగాయాలపాలైన రమేష్ పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ‘సూసైడ్ చేసుకుంటున్నా, ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’ యువ ఇంజనీర్ విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.