యాప్నగరం

Nellore: గిరిజన మహిళను అడ్డగించి ముగ్గురి గ్యాంగ్ రేప్

మద్యం మత్తులో వేధించిన భర్తపై కోపంతో వెళ్తున్న గిరిజన మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Samayam Telugu 29 Sep 2019, 9:07 am
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా, న్యాయస్థానాలు ఎన్ని కఠినశిక్షలు విధిస్తున్నా కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఎక్కడో చోట కీచకుల చేతితో అబలల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గిరిజన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Samayam Telugu rape


Also Read: బాలికపై 10రోజుల వ్యవధిలో రెండుసార్లు గ్యాంగ్ రేప్

నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ శుక్రవారం రాత్రి భర్తతో కలిసి సమీప గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె భర్త పుల్లుగా మద్యం తాగి గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన మహిళ రాత్రివేళ ఒంటరిగానే ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆమెను అడ్డగించి వేధించారు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా కనికరించకుండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: కదులుతున్న కారులో మహిళపై 9మంది గ్యాంగ్ రేప్

అపస్మాకర స్థితిలోకి వెళ్లిన ఆమెను దుండగులు అక్కడే వదిలేసి పారిపోయారు. శనివారం ఉదయం మెలకువ వచ్చిన బాధితురాలు ఇంటికి వెళ్లి బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పక్క గ్రామానికి చెందిన కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామాక్షయ్యగా గుర్తించి అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. భర్తను బంధించి భార్యపై యజమానుల అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.