యాప్నగరం

కాకినాడలో కామాంధులు.. మహిళను రేప్ చేసి వీడియోలతో బెదిరింపులు

భర్తకు దూరంగా ఉంటున్న మహిళను లొంగదీసుకున్న రఘు అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి వీడియో తీశాడు. దీన్ని అవకాశంగా తీసుకుని మరో ఇద్దరు యువకులు ఆమెపై వేధిస్తున్నారు.

Samayam Telugu 15 Jul 2020, 9:55 am
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కామాంధులు రెచ్చిపోయారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేసిన యువకుడు ఆమెను మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారం చేయడమే కాకుండా.. ఆ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము కోరినప్పుడల్లా కోరిక తీర్చకపోతే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Samayam Telugu Image


Also Read: మరిదితో అఫైర్‌కి అడ్డుగా ఉన్నాడని భర్త దారుణహత్య.. వికారాబాద్‌లో దారుణం

కాకినాడ సర్పవరం ప్రాంతానికి చెందిన మహిళ మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు కొద్దినెలల క్రితం రఘు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమెకు అవసరమైన పనులు చేస్తూ రఘు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 27న తన ఇంటికి ఆహ్వానించి మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేసి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు.

Also Read: ప్రియుడి మోసం.. హైదరాబాద్‌లో న్యూస్ ఛానల్ ఉద్యోగిని ఆత్మహత్య

తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. ఇలా ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాయికిరణ్ అనే యువకుడు కూడా కొంతకాలంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చకపోతే ఈ వీడియో సంగతి బయటపెడతానని బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రఘు, సాయికిరణ్‌తో పాటు మరో యువకుడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియో.. కీసరలో మహిళా అధికారి నిర్వాకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.