యాప్నగరం

విశాఖలో దంపతులను ఢీకొన్న లారీ.. గర్భిణి మృతి

ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చి లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో 3 నెలల గర్బిణి అయిన అప్పలనర్సమ్మ అక్కడికక్కడే చనిపోయింది.

Samayam Telugu 9 Apr 2020, 7:46 am
వారిద్దరికి 10 నెలల క్రితం వివాహమైంది. వారి ప్రేమకు గుర్తుగా భార్య గర్భం దాల్చింది. దీంతో రెండు కుటుంబాల్లో ఆనందం విల్లివిరిస్తోంది. మరికొద్ది నెలల్లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఆ దంపతులు మురిసిపోతున్నారు. కానీ విధి వారిని చిన్నచూపు చూసింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు భార్య ప్రాణాలను హరించింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.
Samayam Telugu pjimage (13)


Also Read: సహజీవనం చేసి హ్యాండిచ్చిన ప్రియురాలు.. టెక్కీ ఆత్మహత్య

కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలేనికి చెందిన ఈర్లె అప్పలనర్సమ్మ (24)కు మల్లు నాయుడుతో 10 నెలల క్రితం వివాహమైంది. మల్లునాయుడు పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అప్పలనర్సమ్మ మూడు నెలల గర్భిణి. బుధవారం ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు భర్త విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్తున్నాడు. మధ్యాహ్నం వారిద్దరూ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ లారీ వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: మత్తుమందిచ్చి.. నగ్నఫోటోలు తీసి.. వివాహితపై పాస్టర్ అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.