యాప్నగరం

లాక్‌డౌన్‌లో అఘాయిత్యాలు... చాక్లెట్లు ఆశచూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం

లాక్‌డౌన్‌లోనూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 9 Apr 2020, 9:42 am
దేశమంతా కరనా భయంతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతే కామాంధులు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఆమెను గమనించిన పక్కింట్లో ఉండే పవన్ సింగ్(18) బాలికను మాటల్లో దించాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పిన తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.
Samayam Telugu girl rape


Also Read: ఇంటర్ స్టూడెంట్‌తో ఆంటీ అఫైర్... బండారం బయటపడటంతో చివరికి

ఆ సమయంలో అతడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే అతడి ఇంటికి రాగా నిందితుడు పరారయ్యాడు. బాలిక జననాంగాల వద్ద రక్తస్రావం కావడంతో ఆమె స్థానికుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడు పవన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

Also Read: మత్తుమందిచ్చి.. నగ్నఫోటోలు తీసి.. వివాహితపై పాస్టర్ అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.