యాప్నగరం

‘నువ్వైనా సుఖంగా ఉండు’.. మూడో భార్యకు మెసేజ్‌ పెట్టి యువకుడి ఆత్మహత్య

ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్న రాజశేఖర్‌కు ఆమెతోనూ కలహాలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం భార్యకు మెసేజ్ పెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 26 Apr 2020, 8:21 am
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ శివరాంనగర్‌ కాలనీకి చెందిన పొట్టబత్తిని రాజశేఖర్‌(30) పానగల్‌ చెరువు ప్రాంతంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Image


Also Read: 17ఏళ్ల కాపురం.. ప్రియుడితో పెళ్లి కోసం భర్తను చంపి.. కర్నూలులో దారుణం

నల్గొండ టూటౌన్ ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం.. రాజశేఖర్‌కు గతంలో ఆరు నెలల క్రితం మూడో వివాహం జరిగింది. గతంలో వివాహం చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు కొద్దిరోజులకే అతడితో విడాకులు తీసుకోవడంతో ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడి జీవితంలో మార్పు రాలేదు. మూడో భార్యతోనూ గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నేను చనిపోతున్నా. నువ్వైనా సుఖంగా ఉండు’ అంటూ శుక్రవారం భార్య సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేసిన రాజశేఖర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నిజామాబాద్‌ జిల్లాలో కలకలం.. ఏపీ యువతి దారుణహత్య.. దహనం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.