యాప్నగరం

విడాకులిచ్చిన భార్య... ఒంటరితనాన్ని భరించలేక భర్త ఆత్మహత్య

భార్య విడాకులు ఇవ్వడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాంబాబు లాక్‌డౌన్‌ కారణంగా ఒంటరిగా ఉన్నాడు. దాన్ని భరించలేక మనోవేదనకు గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 21 Apr 2020, 9:03 am
ఒంటరితనాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. టి.నరసాపురం మండల కేంద్రానికి చెందిన బైగాని రాంబాబు(35) అనే వ్యక్తికి చాలా ఏళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా పదేళ్ల క్రితం వారిద్దరు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు.
Samayam Telugu dead body


Also Read: పోర్న్ ప్రియులకు షాక్.. ఆ సైట్లలో వీడియోలు చూశారో జేబు ఖాళీ

అప్పటి నుంచి ఏలూరులో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాంబాబు టి.నరసాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా సంస్థ మూతపడటంతో కొద్దిరోజులుగా గదికే పరిమితమయ్యాడు. దీంతో ఒంటరితనాన్ని భరించలేక మనోవేదనకు గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగేశాడు.

Also Read: హైదరాబాద్‌లో కామపిశాచి.. భర్త లేని సమయంలో ప్రియుడితో

అతడిని గమనించిన స్థానికులు బంధువులకు సమాచారమిచ్చారు. దీంతో వారు రాంబాబును వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంబాబు తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: మూక చేతిలో సాధువుల హత్య.. 110 మంది అరెస్ట్.. ఒత్తిడిలో ‘మహా’ సర్కార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.