Hyderabad: కత్తులతో పొడిచి రౌడీషీటర్ దారుణహత్య
హైదరాబాద్లో దారుణం జరిగింది. పాత కక్షలతో కొందరు దుండగులు రౌడీ షీటర్ను కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడిపై ఎస్సార్ నగర్లో పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.
Samayam Telugu 13 Aug 2019, 11:58 am
ప్రధానాంశాలు:
- హైదరాబాద్లో దారుణం
- సనత్నగర్ పరిధిలో రౌడీషీటర్ దారుణహత్య
- పాత కక్షలే కారణమంటున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఆరుగురు దుండగులు పోచయ్య గౌడ్ అలియాస్ పోచి(35)ని కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది చంపేశారు. నగరంలో కలకలం సృష్టించిన హత్య తాలూకు వివరాలిలా ఉన్నాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. . మృతుడి శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.హత్యను ప్రత్యక్షంగా చూసి వారిని విచారించి వివరాలు ఆరా తీశారు. పోచయ్యకు బంధువులతో వివాదాలు ఉన్నాయని, పాతకక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు