యాప్నగరం

భర్త ఆత్మహత్య.. బావతో సహజీవనం.. చివరకు ఆమె కూడా

16ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్న జ్యోతి బావతో అక్రమ సంబందం పెట్టుకుంది. దీనిపై కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుండటంతో శనివారం ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 6 Apr 2020, 9:56 am
కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని బండ్లపాయి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన జ్యోతి (38)కి వాసు అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15, 12 ఏళ్ల వయసుగల పిల్లలున్నారు. అయితే కుటుంబ కలహాలతో వాసు 2004లో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒంటరి అయిన జ్యోతి గ్రామంలోనే ఓ వ్యక్తి పొలం దగ్గర గుడిసె వేసుకుని జీవిస్తోంది.
Samayam Telugu 38 yr old woman commits suicide im chittoor district over illegal affair
భర్త ఆత్మహత్య.. బావతో సహజీవనం.. చివరకు ఆమె కూడా


Also Read: ఒకే అమ్మాయితో ఇద్దరి లవ్... ఆనంద్‌రెడ్డి హత్యకేసులో మరో ట్విస్ట్

ఈ క్రమంలో బావ చంద్రశేఖర్‌(వాసు అన్న)తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. చంద్రశేఖర్‌ తరుచూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విషయం అతడి భార్య, కుటుంబసభ్యులకు తెలియడంతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బంధువులంతా జ్యోతిని మందలిస్తుండటంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్‌ చేశారు. అయితే మార్గమధ్యంలో జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపైచౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మరదలితో అఫైర్.. అడ్డుగా ఉందని భార్య హత్య.. వీడు మామూలోడు కాదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.