ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణలోని హన్మకొండలో రెండు నెలల క్రితం 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన మానవ మృగం ప్రవీణ్కు కోర్టు ఉరిశిక్ష విధించిన రోజే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. బిస్కట్లు ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు.
దీంతో వారు బాలికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి గురువారం సాయంత్ర గ్రామంలో పర్యటించి బాలిక పేరెంట్స్ను, స్థానికులను విచారించారు.