నాలుగేళ్ల చిన్నారిపై పాతికేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామంలో పేద దంపతులు కూలీపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి బాలికను నానమ్మ వద్ద ఉంచి రోజూ పనులకు వెళ్తుంటారు. రెండ్రోజుల క్రితం బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా పక్కింట్లో ఉండే విజయేందర్ అనే యువకుడు గమనించాడు. బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విజయేందర్ బాలిక కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అతడికి వివాహమైందని, భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు.