యాప్నగరం

కోచింగ్ సెంటర్ కుప్పకూలి ఐదుగురు మృతి.. ఢిల్లీలో విషాదం

నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఉన్న సమయంలో కూలడంతో పెనువిషాదం మిగిల్చింది.

Samayam Telugu 25 Jan 2020, 8:32 pm
ఢిల్లీలో విషాద ఘటన చోటుచేసుకుంది. భజన్‌పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండడంతో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు చనిపోయినట్లు సమాచారం. మరో 13 మంది విద్యార్థులు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu delhi


ఢిల్లీలో కుప్పకూలిన భవనంలో రెండు, మూడు అంతస్తులు నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుంగా ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 15 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: డివైడర్‌ని ఢీకొట్టిన అంబులెన్స్.. స్పాట్‌లోనే ముగ్గురు.. నెల్లూరులో విషాదం

శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని.. కొద్దిసేపట్లో సంఘటన స్థలానికి వెళ్లబోతున్నట్లు ట్వీట్ చేశారు.

Read Also: మొగుడ్ని చంపించింది.. ప్రియుడిని బుక్ చేసింది.. కీలాడీ లేడీ ప్లాన్‌కి హైదరాబాద్ పోలీసులు షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.