యాప్నగరం

తల్లి, భార్య, ముగ్గురు పిల్లలను దారుణంగా చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి

ముంగేర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కన్నతల్లి, భార్య, ముగ్గురు పిల్లలను కిరాతకంగా చంపేశాడు. అనంతరం బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 17 Jan 2020, 11:18 am
బిహార్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి సొంత కుటుంబాన్నే పొట్టన పెట్టుకున్నాడు. ముంగేర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ.. గురువారం అతడిలో రాక్షసుడు నిద్రలేచాడు. నిద్రలో ఉన్న భార్య, ముగ్గురు బిడ్డలతో పాటు కన్నతల్లిని కత్తితో గొంతుకోసి హతమార్చాడు.
Samayam Telugu images (5)


Also Read: చిత్తూరు జిల్లాలో కీచక తండ్రి.. కన్నకూతురిపైనే అత్యాచారం

అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురిని హత్య చేయడానికి గల కారణలను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనలో ముంగేర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: వయస్సు 25, చోరీలు 51.. హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.