ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారింది. చిన్నారి కాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సనత్ నగర్కు చెందిన చంద్రశేఖర్, పావని దంపతులకు ఐదేళ్ల కుమార్తె అక్షర ఉంది. 20 రోజుల క్రితం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ కాలుపై కబోర్డు పడిపోయింది. వెంటనే చిన్నారిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాపను గమనించిన డాక్టర్లు.. మరుసటి రోజు సర్జరీ చేస్తామని చెప్పారు. మరుసటి రోజు డాక్టర్లు పాప తల్లిదండ్రులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సర్జరీ చేయలేమని.. చిన్నారిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఏం చేయాలో తెలియని స్థితిలో పాపను మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. కాలు తీసేయాలని చెప్పారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు.. తప్పనిసరి పరిస్థితుల్లో కాలు తీసేయడానికి అంగీకరించారు. కొద్ది రోజుల తర్వాత పాప కోలుకొని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది.
పాప కాలి నరం తెగిపోవడంతో రక్తప్రసరణ ఆగి.. ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందట. ఒకవేళ కాలు తొలగించకపోతే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అందుకే సర్జరీకి అంగీకరించామని తల్లిదండ్రులు చెప్పారు. మొదటి చేర్చిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కూతురి కాలు తీసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రిపై కేసు నమోదైంది.
పాప కాలి నరం తెగిపోవడంతో రక్తప్రసరణ ఆగి.. ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందట. ఒకవేళ కాలు తొలగించకపోతే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అందుకే సర్జరీకి అంగీకరించామని తల్లిదండ్రులు చెప్పారు. మొదటి చేర్చిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కూతురి కాలు తీసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రిపై కేసు నమోదైంది.