యాప్నగరం

ఆరేళ్ల బాలికపై మైనర్ అత్యాచారం.. చిత్తూరులో దారుణం

ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన కామాంధుడు లోపలికి చొరబడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి అమానుషానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలికని..

Samayam Telugu 5 Aug 2020, 5:53 pm
ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. దానికి తోడు స్మార్ట్‌ఫోన్లు.. పోర్న్ వీడియోల విషసంస్కృతి పెరిగిపోవడంతో టీనేజ్‌కి రాగానే కొందరు యువకులు కామంతో రగిలిపోతున్నారు. కామకోరికలు తీర్చుకునేందుకు దారుణాలకు తెగబడుతున్నారు. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై టీనేజర్ అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఏపీలో తాజాగా వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై టీనేజ్ యువకుడు(17) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో‌కి చొరబడిన దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికకి మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. బంధువుల యువకుడే కావడంతో మామూలుగానే ఇంటికి వచ్చాడనుకుంది. అయితే ఆమెపై కన్నేసిన కామాంధుడు మాయమాటలతో మభ్యపెట్టి రేప్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read: కోవిడ్ శవాలనూ వదలని దుర్మార్గులు.! తిరుపతిలో ఘోరం

సాయంత్రం పొలం నుంచి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ముభావంగా ఉన్న కూతురిని ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన దాష్టీకాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Read Also: కొడుకుతో కోడలు సెక్స్ చేయకూడదట! అడ్డుపడుతున్న మామ.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.