యాప్నగరం

ఏడేళ్ల బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం.. పశ్చిమలో ఘోరం

శనివారం రాత్రి గ్రామంలోని చర్చిలో డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒంటరిగా వెళ్తున్న బాలికకు పదో తరగతి చదువుతున్న బాలుడు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 25 Nov 2019, 1:14 pm
తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరపెడుతున్నాయి. ముక్కపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్యాచారం రాష్ట్రంలో ఎంతటి చర్చకు దారితీసిందో తెలిసింది. ఓ వైపు కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై పదో తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.
Samayam Telugu rape8


Also Read: పదేళ్ల బాలికపై అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో మరో ఘోరం

జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి గ్రామంలోని చర్చిలో డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒంటరిగా వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పదో తరగతి చదువుతున్న బాలుడు బాలికను పలకరించాడు. ఎక్కడికెళ్తున్నావని అడిగి మాయమాటలతో ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

Also Read: ప్రియుడితో బెడ్రూమ్‌‌లో భార్య రొమాన్స్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన భర్త

అక్కడ బాలికపై అత్యాచారం చేసిన బాలుడు తిరిగి గ్రామానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక ఏడుస్తుండటంతో స్థానికులు ఏం జరిగిందని అడగ్గా అసలు విషయం చెప్పింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: అప్పులు తీర్చడానికి భార్య శీలాన్ని తాకట్టు పెట్టిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.