Road Accident తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరంతా శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా.. వారు ప్రయాణిస్తోన్న వాహనం అదుపుతప్పి 40 అడుగుల లోతైన గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. థేనీ జిల్లా కుమిలీ పర్వత మార్గంల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా థేనీ జిల్లా అండిపట్టికి చెందినవారే. కాసేపట్లో స్వస్థలాలకు చేరుకుంటారనగా మృత్యువు వారిని కబళించింది.
ప్రమాదం గురించి థేనీ జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ మాట్లాడుతూ..‘ థేని జిల్లాలోని కుమిలి పర్వత మార్గం వద్ద 40 అడుగుల లోతున్న గొయ్యిలోకి కారు దూసుకెళ్లి ఎనిమిది మంది భక్తులు మరణించారు.. మరికొందరు గాయపడ్డారు’ అని తెలిపారు. అండిపట్టికి చెందిన 10 మంది భక్తులు శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అండిపట్టి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కుమిలి పర్వత మార్గంలో 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కేరళ, తమిళనాడు పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలోనే ఏడుగురు మృతి చెందగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మృతిచెందారు. గాయపడిన ఇద్దరిలో ఒకరు మూడేళ్ల చిన్నారి కాగా.. ప్రస్తుతం వీరిని థేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Latest National News And Telugu News
ప్రమాదం గురించి థేనీ జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ మాట్లాడుతూ..‘ థేని జిల్లాలోని కుమిలి పర్వత మార్గం వద్ద 40 అడుగుల లోతున్న గొయ్యిలోకి కారు దూసుకెళ్లి ఎనిమిది మంది భక్తులు మరణించారు.. మరికొందరు గాయపడ్డారు’ అని తెలిపారు. అండిపట్టికి చెందిన 10 మంది భక్తులు శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అండిపట్టి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కుమిలి పర్వత మార్గంలో 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది.
Read Latest National News And Telugu News