యాప్నగరం

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. వృద్ధురాలిని చంపి 10 తులాల నగలు చోరీ

ఇబ్రహీంపట్నం మండలం కందుకూరు గ్రామానికి చెందిన బాలామణి తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ విషయాన్ని పసిగట్టిన దుండగులు ఆమెను దారుణంగా హత్యచేసి బంగారునగలు ఎత్తుకెళ్లారు.

Samayam Telugu 28 Jan 2020, 10:34 am
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కందుకూరు గ్రామంలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సర్కారీ బాలమణి(80) అనే వృద్ధురాలిని గొంతు నుమిలి చంపేసిన దుండగులు... ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి సమీపంలోనే విగతజీవిగా పడివున్న బాలమణిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu images (5)


Also Read: హైదరాబాద్‌లో కీచకపర్వం.. నడిరోడ్డుపై కూతురిని ఎత్తుకెళ్లి తల్లికి లైంగిక వేధింపులు

ఇబ్రహీంపట్నం ఏసీపీ కాసేపటికే సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది దోపిడీ దొంగల పనా? లేక అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.

Also Read: కిరాతకుడు.. మూడేళ్ల చిన్నారిని రైల్లో నుంచి తోసేసిన గార్డు

బాలామణికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ఆమె గ్రామంలోనే ఒంటరిగా ఉంటూ సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తోంది. ఆమె గురించి పక్కా సమాచారం తెలుసుకునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని పలువురు అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘రూ.7లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతా’నంటూ బెదిరింపు.. కటకటాల్లోకి కిలేడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.