యాప్నగరం

చెరుకు తోటలో బాలిక శవం.. చేతులు కట్టేసి నగ్నంగా దారుణ స్థితిలో

ఆడుకునేందుకు ఇంటికి వెళ్లిన బాలిక రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. మరుసటి రోజు చెరుకుతోటలో విగతజీవిగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.

Samayam Telugu 21 Feb 2020, 3:54 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ రీజియన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మితౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనఖేడా గ్రామ శివారులోని చెరుకుతోటలో తొమ్మిదేళ్ల బాలిక అత్యంత దారుణ స్థితిలో శవమై కనిపించింది. చేతులు కట్టేసి నగ్నంగా పడివున్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu images


Also Read: శాడిస్ట్ భర్త.. భార్యను జంతువులా మార్చేసి, వికృతంగా సెక్స్ చేస్తూ చిత్రహింసలు

కనఖేడా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక మంగళవారం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రాత్రయినా కుమార్తె రాకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా దొరకలేదు. బుధవారం ఉదయం చెరుకుతోటలో నగ్నంగా పడివున్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్ఐలు దిలీప్‌కుమార్ ప్రజాపతి, రామ్‌వీర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Also Read: డ్రగ్స్‌ ఇచ్చి కోర్టులోనే మహిళా లాయర్‌పై అత్యాచారం... వీడియో వైరల్

బాలిక చేతులు కట్టేసి ఉండటం, శరీరంపై దుస్తులు లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

Also Read: అద్దె ఇంట్లో వ్యభిచారం.. నకిలీ విటుడితో కిలేడీ గుట్టురట్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.