యాప్నగరం

Hyderabadలో పరువు హత్య.. ప్రేమించి పెళ్లాడినందుకు అల్లుడ్ని చంపించిన మామ

Chandanagar: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

Samayam Telugu 25 Sep 2020, 12:18 pm
తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. హైదరాబాద్‌‌కు చెందిన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చేయించాడు. గతంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను మారుతీ రావు హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. వివరాలివీ..
Samayam Telugu నూతన వధూవరులు
A father who did not like her daughters marriage has killed son in law


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పరస్ఫర అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి యువతి తండ్రికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన్ను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడంతో యువతి తండ్రి కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హత్య చేయించాడు.

వివాహానంతరం యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. హేమంత్ కనిపించకుండా పోవడంతో అతనిపై గచ్చిబౌలి పీఎస్‌లోనే కిడ్నాప్ కేసు నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.