యాప్నగరం

యువతిపై రేప్, దారుణ హత్య.. చేవెళ్లలో మరో దిశ ఘటన

Thangadapally: ఘటనా స్థలంలో మృతురాలి ఒంటిపై వస్ర్తాలు ఏమీ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు తేల్చారు. గ్రామ శివారు ప్రాంతంలోని ఓ వంతెన కింద దుండగులు ఈ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Samayam Telugu 17 Mar 2020, 12:43 pm
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తంగడపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. అంతకుముందు ఆమెపై దుండగులు అత్యాచారానికి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. చనిపోయిన మహిళకు 30 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, ఆమె వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మహిళ తలపై రాయితో మోదడంతో ఆమె మరణించినట్లుగా భావిస్తున్నారు.
Samayam Telugu Chevella.


Also Read: కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఘటనా స్థలంలో మృతురాలి ఒంటిపై వస్ర్తాలు ఏమీ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు తేల్చారు. గ్రామ శివారు ప్రాంతంలోని ఓ వంతెన కింద దుండగులు ఈ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏమీ లేకపోవడంతో, అక్కడికి వచ్చే మార్గంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Also Read: సిలిండర్ పేలుడు.. తల్లీ, కుమారుడు అక్కడిక్కడే మృతి

మహిళను హత్య చేశాక దుండగులు ఆమెకు సంబంధిన ఆనవాళ్లు ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారని, ఆ నేరంలో ఎంత మంది పాల్గొన్నారనే అంశంపైనా స్పష్టత లేదు. తొలుత మృతురాలు ఏ ప్రాంతానికి చెందిందో తెలిస్తే దర్యాప్తు సులభం అవుతుందని పోలీసులు తెలిపారు.

Also Read: జూబ్లిహిల్స్‌లో ప్రిన్సిపల్ పాడు పనులు.. మత్తు ఇచ్చి టీచర్లపై దారుణం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.