యాప్నగరం

అదనపు కట్నం కోసం శాడిస్టుగా మారిన కానిస్టేబుల్.. భార్య, పిల్లల ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ అదనపు కట్నం కోసం వేధించడంతో ఆయన భార్యా, పిల్లలు అత్మహత్యాయత్నం చేశాడు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా కాపాడారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Samayam Telugu 15 Dec 2019, 3:11 pm
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ అదనపు కట్నం కోసం శాడిస్ట్‌గా మారాడు. దీంతో వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతపురం రూరల్‌ మండలం చిన్నకుంట గ్రామానికి చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్‌ వీరనారాయణకు 2014లో రాప్తాడుకు చెందిన యమునతో వివాహమైంది. కట్నకానుకల కింద రూ. 3 లక్షల నగదు, 16 తులాల బంగారు ఇవ్వడంతో పాటు ఘనంగా వివాహం కూడా జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
Samayam Telugu Fire constable


Also Read: వృద్ధురాలి గొంతు కోసి, యాసిడ్ పోసి హత్య.. జనాగ్రహంతో ఉన్మాది మృతి!

అదనపు కట్నం కోసం వేధింపులు
అయితే కొన్నేళ్లుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వీరనారాయణ వేధిస్తున్నాడు. ఎకరా భూమితో పాటు అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ ప్రతిరోజూ వేధించసాగాడు. దీంతో మనస్తాపం చెందిన యమున శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా కోసం ఎవరూ వెతకవద్దు’ అని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పి పెట్టేసింది.

ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు
యమున ఫోన్ కాల్‌పై ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇటుకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్‌ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విడపనకల్లు ఎస్‌ఐ గోపిని అప్రమత్తం చేశారు. వెంటనే సిబ్బందిని ఎస్‌ఐ రంగంలోకి దింపారు. వారు గాలింపు చేపట్టగా.. జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలోని చీకలగుర్కి ఎర్రితాతస్వామి దేవాలయం వద్ద బాధితురాలు, పిల్లలతో కలిసి ఉండటం గమనించి, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురక్షితంగా రాత్రికిరాత్రే ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు.

Also Read: మరో ‘దిశ’: మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. ఒడిశాలో హైటెన్షన్!

కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారని కానిస్టేబుల్‌
కానిస్టేబుల్‌ వీరనారాయణ వేధింపులపై భార్య గతంలోనే అప్పటి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. ఇక నుంచి భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని రాతపూర్వకంగా తెలిపాడు. కానీ వీరనారాయణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మరోసారి ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: అత్తపై అత్యాచారం.. భార్యకు విడాకులిస్తానని పరార్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.