యాప్నగరం

యువతి బరితెగింపు.. ప్రియుడిపై అక్కసుతో అతడి భార్య గొంతు కోసి పరార్

శ్రీనివాసులును తనను దక్కకుండా చేసిన మహేశ్వరిపై యువతి పగ పెంచుకుంది. ఆమెను అడ్డు తొలగించుకుంటే అతడి తానే పెళ్లి చేసుకోవచ్చని భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడి ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి పరారైంది.

Samayam Telugu 12 Nov 2019, 11:19 am
ప్రేమించిన వ్యక్తి దక్కలేదన్న అక్కసుతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతడి ఇంటికి వెళ్లి భార్య గొంతు కోసేసింది.అ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.
Samayam Telugu murder


Also Read: వరకట్న వేధింపులు.. పెళ్లయిన ఆర్నెల్లకే రాలిపోయిన ‘దివ్య’

అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివసించే శ్రీనివాసులు అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించింది. అయితే ఈ విషయాన్ని మాత్రం అతడికి చెప్పడంతో తన ప్రేమను మనసులోనే దాచుకుంది. ఈ విషయం తెలియని శ్రీనివాసులు మహేశ్వరి(19) అనే యువతిని ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

Also Read: కొండవీడు చూసొస్తానని వెళ్లి... ప్రియుడి చేతిలో దారుణ హత్య

ఈ విషయం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీనివాసులును తనను దక్కకుండా చేసిన మహేశ్వరిపై పగ పెంచుకుంది. ఆమెను అడ్డు తొలగించుకుంటే అతడి తానే పెళ్లి చేసుకోవచ్చని భావించింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లి యువతి మహేశ్వరితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారైంది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మహేశ్వరి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అని కుటుంబసభ్యులు తెలిపారు.

Also Read: విహారయాత్రకు వెళ్తూ.. లారీ చక్రాల కింద నలిగిన మెడికల్ స్టూడెంట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.