యాప్నగరం

మరదలితో అక్రమ సంబంధం.. టీడీపీ నేతకు మూడేళ్ల జైలుశిక్ష

రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకున్న ఈశ్వరయ్య తన మరదలితో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ మూడేళ్ల క్రితం ఇంట్లోనే ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 24 Oct 2019, 12:26 pm
మరదలితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ నేతకు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. పెళ్లయి పిల్లలున్న ఈశ్వరయ్యకు మరదలు రాధ అంటే చాలా ఇష్టం. పెళ్లయిన ఆమెను మాయమాటలతో వలలో వేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
Samayam Telugu pjimage (7)


ఈ విషయం మహిళ భర్త శ్రీకాంత్‌కు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించాడు. అయితే రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకున్న ఈశ్వరయ్య తన మరదలితో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ మూడేళ్ల క్రితం ఇంట్లోనే ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి సోదరి ఈశ్వరయ్య, అతడి మరదలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరు వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే తన సోదరుడు చనిపోయాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

దీంతో పోలీసులు ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం శ్రీకాంత్ ఆత్మహత్యకు వారిద్దరు ప్రేరేపించినట్లు నిర్ధారించింది. ఈశ్వరయ్య, రాధకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.5వేల జరిమానా విధిస్తూ ధర్మవరం న్యాయస్థానం తీర్పు చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.