యాప్నగరం

ఆడపిల్ల తండ్రిగా ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా: ఏపీ మంత్రి

‘దిశ’ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ఆడపిల్ల తండ్రిగా సమర్థిస్తున్నట్లు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఇకపై ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఆడపిల్లల‌కు మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించాలన్నారు.

Samayam Telugu 6 Dec 2019, 1:07 pm
వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఎన్‌కౌంటర్‌‌ను సమర్థిస్తున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu minister-avanti-srinivas


ఇకపై అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆడపిల్లల‌కు మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించాలని కోరారు. దిశకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదని భావోద్వేగం చెందారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి పురుషుడు మహిళలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. దిశను సజీవదహనం చేసిన చోటే అత్యాచార ఘటనను రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఘటనలో అక్కడికక్కడే నిందితులు మృతి చెందారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ నిర్ధారించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.