యాప్నగరం

కాకినాడలో కిరాతకం.. రూ.2ల కోసం వ్యక్తి హత్య

సైకిల్ షాపులో గాలి కొట్టించుకుని రూ.2లు ఇవ్వకపోవడంతో మొదలైన వివాదం. సైకిల్ షాపు ఓనర్‌ సాంబను దుర్భాషలాడిన సువర్ణరాజును కత్తితో పొడిచి చంపేసిన అతడి స్నేహితుడు అప్పారావు.

Samayam Telugu 10 Nov 2019, 10:48 am
కాకినాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం రూ.2ల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కాకినాడలోని వలసపాక ప్రాంతంలో సాంబ అనే వ్యక్తి సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం సువర్ణరాజు అనే యువకుడు షాపుకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు. అతడిని రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరగా తిట్టాడు. డబ్బులు ఇవ్వనని చెప్పి సాంబతో గొడవపడి చేయి చేసుకున్నాడు.
Samayam Telugu argument on 2 rupees man bruatally murdered in kakinada
కాకినాడలో కిరాతకం.. రూ.2ల కోసం వ్యక్తి హత్య


Also Read: ‘పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా’ నంటూ వేధింపులు.. యువకుడి అరెస్ట్

ఆ సమయంలో షాపు వద్దనే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు ఆవేశంతో రెచ్చిపోయాడు. కత్తితో సువర్ణరాజును విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకుని సువర్ణరాజును ఆస్పత్రికి తరలించారు.

Also Read: ప్రేమించిన వ్యక్తి దక్కలేదని... ప్రియుడి భార్య గొంతు కోసిన యువతి

డాక్టర్లు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి సువర్ణరాజు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కాకినాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Also Read: వరకట్న వేధింపులు.. పెళ్లయిన ఆర్నెల్లకే రాలిపోయిన ‘దివ్య’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.