యాప్నగరం

తలకిందులైన స్కూల్ ఆటో.. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో తలకిందులైంది. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి బోల్తా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Samayam Telugu 24 Jan 2020, 9:00 pm
స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటన తెలంగాణలో జరిగింది. ఆ సమయంలో ఆటోలో 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆటో వేగంగా వెళ్తూ ఒక్కసారిగా తలకిందులుగా తిరగబడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా జిల్లెడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu pjimage (54)


జిల్లాలోని చౌదర్ గూడ మండలంలోని ప్రశాంత్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఆటో విద్యార్థులతో వెళ్తూ బోల్తా పడింది. చౌదర్ గూడ నుంచి చౌడపూర్ వైపు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. జిల్లెడ్ గ్రామం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు.

Also Read
: ఫేస్‌బుక్‌లో బిజీబిజీగా భార్య.. అబ్బాయిలతో ఎక్కువసేపు చాటింగ్.. చివరికి.!

ఆటో తిరగబడడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. స్కూల్ బ్యాగులు, విద్యార్థుల వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

Read Also: ఒంగోలులో ఘోరం.. బాలికను బలవంతంగా లాక్కెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.