యాప్నగరం

రేపిస్టులను చంపితే రూ.లక్ష నజరానా.. ఆఫర్ ఇచ్చింది ఎవరో తెలుసా?

అయోధ్యలోని హనుమాన్ ఆలయంలో పూజారి పనిచేసే రాజు దాస్ మహిళలపై అత్యాచారం జరిగినా నేరానికి పాల్పడిన వారిని చంపితే తాను రూ.లక్ష చొప్పున ఇస్తానంటూ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Samayam Telugu 15 Dec 2019, 3:21 pm
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కామాంధులు చిక్కితే కొట్టి చంపేయాలన్న కసి వారిలో కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ‘దిశ’ హత్యాచారం కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజలు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ తీవ్ర ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వారిని తమకు అప్పగించాలని, లేకుంటే బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత పోలీసులు ఎన్‌కౌంటర్లో ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu rape9


Also Read: హిందూపురంలో మట్కా మాఫియా దాడి.. మహిళ చేతులు కట్టేసి గొంతు నులిచి

అసలు విషయానికొస్తే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూజారి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ మహిళలపై అత్యాచారం జరిగినా నేరానికి పాల్పడిన వారిని చంపితే తాను రూ.లక్ష చొప్పున ఇస్తానంటూ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజు దాస్ అనే వ్యక్తి అయోధ్యలోని హనుమాన్ ఆలయంలో పూజారి. కొద్దిరోజుల క్రితం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కామాంధులను ఎవరు చంపినా తాను రూ.లక్ష నగదు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ నేరస్థులను పోలీసులే కాల్చి చంపినా కూడా వారి కుటుంబాలకు మరింత సాయం చేస్తానని ప్రకటించారు.

Also Read: భార్య వేధింపులు, దుబారా ఖర్చులు భరించలేక టెక్కీ ఆత్మహత్మ

Also Read: యువతితో ఇద్దరు బిడ్డల తండ్రి ప్రేయాయణం.. నిజం తెలిసి తట్టుకోలేక

మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని, వారికి తగిన శిక్ష విధించేలా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు రాజు దాస్ తెలిపారు. కోర్టులు ఎన్ని శిక్షలు వేసినా కామాంధుల్లో మార్పులు రావడం లేదని, జనం మధ్య ఉంటూనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. సమాజంలో మార్పు వచ్చేవరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. రాజుదాస్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.