యాప్నగరం

నూజివీడులో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

నూజివీడులోని సిద్దార్ధ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న శైలజ గురువారం హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా కనిపిస్తోంది.

Samayam Telugu 30 Jan 2020, 4:42 pm
కృష్ణా జిల్లా నూజివీడులో బీ ఫార్మసీ చదువుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన శైలజ సిద్ధార్థ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. గురువారం కాలేజీ హాస్టల్‌లో చున్నీతో ఉరేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఫోన్ చేసి పోలీసులకు చెప్పడంతో కాసేపటికే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Samayam Telugu suicie


Also Read: చికెన్ షాపు యజమానితో మహిళ అఫైర్.. నిద్రిస్తున్న భర్తను తలపై కొట్టి

హాస్టల్ రూమ్‌లో శైలజ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు బ్రతకడం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని, దీనిపై ఎవరూ విచారించొద్దని ఆమె లేఖలో పేర్కొంది. అయితే ప్రేమ వ్యవహారంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె ఎవరెవరితో మాట్లాడిందో ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు పోలీసులు తెలిపారు.

Also Read: యువకుడిపై కన్నేసిన వివాహిత... కోరిక తీర్చలేదని అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.