యాప్నగరం

లోన్ ఇప్పిస్తానని నమ్మించి.. యువతిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారం

ఒడిశాలోని కటక్‌లో ఓ బ్యాంకులో పనిచేస్తున్న శిశిరతాసేన్‌ సెలవుపై స్వస్థలమైన ఝార్ఖండ్‌ వెళ్లి అక్కడ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Samayam Telugu 18 Jun 2020, 10:24 am
లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై బ్యాంక్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన శిశిరతాన్‌సేన్‌ అనే వ్యక్తి కటక్‌లోకి సెంట్రల్ బ్యాంక్ బిరబటి శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం సెలవు పెట్టి స్వస్థలానికి వెళ్లిన శిశిరతాన్‌సేన్‌‌కు అక్కడ ఓ యువతి పరిచయమైంది. ఆమెకు లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల సెలవు ముగియడంతో కటక్ వచ్చి విధుల్లో చేరాడు.
Samayam Telugu Image


Also Read: వరంగల్‌లో ప్రేమోన్మాదం.. ఇంటర్ బాలికను బీరు సీసాతో పొడిచిన యువకుడు

అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శిశిరతాన్‌సేన్‌‌పై కేసు నమోదు చేసుకున్న ఝార్ఖండ్ పోలీసులు కటక్ చేరుకుని చౌలియాగంజా ఠాణా పోలీసుల సహాయంతో మంగళవారం అతడిని అరెస్టు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లోకి తీసుకుని ఝార్ఖండ్‌కు తరలించారు.

Also Read: కన్నబిడ్డనే గర్భవతిని చేసిన తండ్రి.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.