యాప్నగరం

నిండు గర్భిణిని చంపేసిన యాచకుడు.. హైదరాబాద్‌లో దారుణం

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద దారుణం జరిగింది. మద్యానికి డబ్బులివ్వలేదని నిండు గర్భిణిని భర్త కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.

Samayam Telugu 26 Aug 2020, 3:01 pm
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్దనిండు గర్భిణి దారుణ హత్యకు గురైంది. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని యాచకుడు నెలలు నిండిన భార్యని కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. గాంధీ ఆస్పత్రి ఏరియాలో గౌతమ్, మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన గౌతమ్ భార్యని మందు తాగేందుకు డబ్బులు అడిగాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pregnant murder


అందుకు ఆమె నిరాకరించడంతో నిండు గర్భిణి అన్న కనీస కనికరం లేకుండా దారుణంగా చంపేశాడు. రాత్రి సమయంలో భార్యను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: అప్పగింతల్లో వరుడికి షాక్.. ప్రియుడి చెంతకు వధువు, పెళ్లి బరాత్‌లో రచ్చరచ్చ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.