యాప్నగరం

బంగారు నాణేల పేరుతో బళ్లారి గ్యాంగ్ బురిడీ.. రూ.25 లక్షలతో పరారీ

ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని తక్కువ ధరకే అమ్ముతామంటూ బళ్లారి గ్యాంగ్ నమ్మించింది. చివరికి..

Samayam Telugu 11 Jul 2020, 3:56 pm
బంగారు నాణేల పేరుతో కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్ రూ.25 లక్షలకు శఠగోపం పెట్టింది. ఇంటికి పునాది తవ్వుతుంటే బంగారు నాణేలు బయటికొచ్చాయని.. తక్కువకే ఇస్తామని నమ్మించడంతో ఓ వ్యక్తి ఏకంగా పాతిక లక్షలు సమర్పించుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. బళ్లారిలో ఇంటి పునాదులు తీస్తుండగా భారీగా బంగారు నాణేలు దొరికాయని.. వాటిని తక్కువకే విక్రయిస్తామంటూ కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్ కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన బాల చెన్నారెడ్డిని సంప్రదించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gold


తక్కువ ధరకే భారీ మొత్తంలో బంగారం సొంతమవుతుందని అత్యాశకు పోయిన చెన్నారెడ్డి డీల్‌కి ఓకే చెప్పాడు. పాతిక లక్షల రూపాయలు సిద్థం చేశాడు. నగదు తీసుకుని అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి వద్ద గ్యాంగ్‌ని కలిశాడు. నగదు తీసుకున్న ముఠా సభ్యులు నకిలీ బంగారు నాణేలు అంటగట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ విషయం ఆలస్యంగా గ్రహించిన చెన్నారెడ్డి లబోదిబోమంటూ బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: ఎస్‌బీఐ నకిలీ బ్రాంచ్ ఓపెన్.. కేటుగాళ్ల ఘరానా మోసం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.