యాప్నగరం

బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆత్మహత్య

బెంగళూరు నుంచి వచ్చిన శంషాబాద్‌లోని ఓయో హోటల్‌లో రూమ్ తీసుకున్న శ్రీవాస్తవ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీళ్లలో విషం కలిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Samayam Telugu 24 Dec 2019, 1:36 pm
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యా్ర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన శ్రీవాస్తవ సోమవారం శంషాబాద్‌లోని ఓయో హోటల్‌లో రూమ్ నంబర్ 106లో దిగాడు. తర్వాత బయటికి వెళ్లిన అతడు రాత్రి 1.30 గంటల సమయంలో రూమ్‌కి వచ్చాడు. హోటల్ సిబ్బంది మంగళవారం తలుపుకొట్టగా ఎంతసేపటికీ తీయలేదు. దీంతో వారు తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడా అతడు మంచంపై పడి ఉన్నాడు.
Samayam Telugu images (5)


Also Read: యువతి వెన్నులో బుల్లెట్... సంచలన విషయం వెలుగులోకి

అదే సమయంలో శ్రీవాస్తవ సెల్‌ఫోన్‌కు కాల్ రావడంతో సిబ్బంది మాట్లాడారు. అవతలి నుంచి తాము బెంగళూరు పోలీసులమని, శ్రీవాస్తవ కనిపించకుండా పోవడంతో అతడి కోసం వెతుకుతున్నామని చెప్పారు. శ్రీవాస్తవ ఆత్మహత్య చేసుకున్నట్లు హోటల్‌ సిబ్బంది చెప్పడంతో బెంగళూరు పోలీసులు శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్షణాల్లో వారు హోటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

Also Read: నదిలో పడిన బస్సు.. 24 మంది ప్రయాణికులు దుర్మరణం

శ్రీవాస్తవ వాటర్‌లో విషయం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే శ్రీవాస్తవ ఆత్మహత్య చేసుకోవడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చాడన్నది సస్పెన్స్‌గా మారింది. ఆత్మహత్య విషయం అతడి తల్లిదండ్రులకు చేరవేసిన పోలీసులు దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read: మైనర్ బాలికను రేప్ చేసి.. వ్యభిచార గృహానికి అమ్మేసి.. మోదీ ఇలాఖాలో ఘోరం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.