యాప్నగరం

ఆమెకు పిల్లలు పుట్టరన్న జ్యోతిష్కుడు.. చివరికి..

భార్యకి గర్భం రాలేదని భర్త, అత్తని కుటుంబ సభ్యులు ఆమెను జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన పిల్లలు పుట్టరని తేల్చి చెప్పాడు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Samayam Telugu 15 Nov 2020, 11:38 am
పెళ్లై ఏడాది తిరక్కుండానే భార్య గర్భం దాల్చలేదంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో చిత్రవధ చేశారు. పిల్లలు పుట్టకపోతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సింది పోయి జ్యోతిష్కుడిని సంప్రదించారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని జోస్యం చెప్పడంతో నమ్మేసిన కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. భరించలేకపోయిన భార్య అఘాయిత్యానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pregnant


అగారా ఏరియాకి చెందిన అశ్విని(25)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో యువరాజ్‌తో వివాహమైంది. కొద్దికాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లై ఏడాది కూడా తిరక్కుండానే భార్య గర్భం దాల్చడం లేదంటూ అత్తింటి వారు సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. సమస్య ఉంటే ఆస్పత్రికి వెళ్లి భార్యాభర్తలు చికిత్స చేయించుకోవాల్సింది పోయి ఆమెను ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు.

ఆమెకి పిల్లలు పుట్టరని జ్యోతిష్కుడు తేల్చిచెప్పడంతో అశ్వినికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు చీటికీమాటికీ ఘర్షణ పడుతుండడంతో భరించలేకపోయింది. ఇంట్లో చిన్న విషయమై మరోమారు గొడవ జరగడంతో తట్టుకోలేకపోయిన అశ్వని వేరే గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బ్యూటీపార్లర్‌కని చెప్పి వెళ్లిన మేనేజర్ భార్య.. రాత్రి ఫోన్ చెక్ చేయడంతో.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.