యాప్నగరం

పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ వేధింపులు.. యువకుడిపై నిర్భయ కేసు

ఫోన్లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్న బెంగళూరు చెందిన యువకుడిపై హైదరాబాద్ పోలీసులు నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Samayam Telugu 12 Jan 2020, 9:29 am
రాంగ్‌ కాల్‌తో ఏర్పడిన పరిచయంతో మాటలు కలిపాడు. ప్రేమ పేరిట వేధింపులకు గురిచేశాడు. తనకిష్టం లేదని యువతి చెప్పడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Samayam Telugu 10woman


Also Read: విషం కలిపిన పాలు తాగి.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

కూకట్‌పల్లిలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ప్రశాంత్‌ (24)తో సెల్‌ఫోన్లో పరిచయం ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన అతను తనను కలవాలని.. లేదంటే ఆఫీసుకు వచ్చి గొడవ పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె ఓ పార్కులో అతడిని కలిసేందుకు వెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రశాంత్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.

Also Read: విషం కలిపిన పాలు తాగి.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ఈ నెల పదో తేదీన జూబ్లీహిల్స్‌లోని యువతి కార్యాలయానికి వెళ్లిన ప్రశాంత్ కొలీగ్స్ ముందే ఆమెను మరోసారి బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఫేస్‌బుక్ పరిచయం.. వివాహితను ట్రాప్ చేసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.