యాప్నగరం

పరాయి మగాడితో పడక సుఖం.. బరితెగించిన భార్య ఘాతుకం

కామవాంఛలతో రెచ్చిపోయిన భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలిసిపోవడంతో అతనితో వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న భర్త హఠాత్తుగా శవమై తేలడం..

Samayam Telugu 11 Aug 2020, 10:38 pm
కామంతో బరితెగించిన భార్య ప్రియుడి మోజులో ఘాతుకానికి పాల్పడింది. పరాయి మగాడితో కలసి కట్టుకున్న భర్తని దారుణంగా చంపేసి పరారైన అమానుష ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మాండ్య తాలూకా మలవల్లి గ్రామానికి చెందిన సిద్దరాజు అలియాస్ సిద్ద గూడ్స్ ట్రక్కు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. భార్య లతతో కలసి నగరంలోని హనుమంతనగర్‌లో నివాసముంటున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
illegal affair


పడక సుఖం కోసం బరితెగించిన అతని భార్య లక్ష్మణ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో రహస్యంగా రాసలీలలు సాగించేది. ఆ విషయం భర్తకి తెలిసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించడంతో ప్రియుడితో వెళ్లిపోయింది. అప్పటి నుంచి సిద్ద ఒంటరిగానే ఉంటున్నాడు. సడెన్‌గా బసవనగుడి ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బన్న చెట్టి రోడ్డులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్‌కి చేరుకుని పరిశీలించారు.

Also Read: భర్తతో వచ్చిన ప్రియురాలు.. తుపాకీతో ఎదురెళ్లిన ప్రేమోన్మాది.. ఘాతుకం

కత్తితో విచక్షణా రహితంగా పొడిచేయడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తేల్చారు. హతుడిని సిద్దరాజుగా గుర్తించిన పోలీసులు ఆరా తీశారు. భార్య లత, ఆమె ప్రియుడు లక్ష్మణ పరారీలో ఉండడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భార్యే ప్రియుడితో కలసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: కొడుకుతో కోడలు సెక్స్ చేయదట.! అందుకే.. 55 ఏళ్ల అత్త షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.