ప్రియుడితో వివాహిత పరార్... భర్తను ఇరికించేందుకు మాస్టర్ ప్లాన్
పిక్నిక్కు వెళ్లిన సమయంలో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన వివాహిత అతడితో వెళ్లిపోయింది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు అతడిపై తప్పుడు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu 4 Aug 2020, 10:44 am
ప్రియుడితో కలిసి బ్రతికేందుకు నిర్ణయించుకున్న ఓ వివాహిత భర్త అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. వైట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి(32) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి 8ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. మూడు రోజుల క్రితం ఆమె కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్ చేసి తన భర్త వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అక్రమంగా చీటీల వ్యాపారం చేస్తున్నాడని, వద్దని చెప్పిన తనను ఇంటి నుంచి గెంటేశాడని చెప్పింది.
Also Read: భర్తను చితకబాది.. భార్యను పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కర్నూలు జిల్లాలో దారుణం
దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు అపర్ణ పూర్ణేశ్ ఆమె భర్త ఫోన్ సేకరించి అతడిని విచారించారు. పది రోజులుగా తన భార్య కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని అతడు చెప్పడంతో వారు షాకయ్యారు. లోతుగా విచారణ చేపట్టగా ఆమె గుట్టు బయటపడింది. కొంతకాలం ఆమె తన స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకుని తరుచూ ఛాటింగ్ చేసుకుంటూ, కాల్స్ చేసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకు వీరి స్నేహం ప్రేమగా మారి కలిసి జీవించాలనుకున్నారు.
Also Read: రెండో భర్త సాయంతో ప్రియుడి మర్డర్.. గుంటూరు వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
పది రోజుల క్రితం ఆమె భర్త, బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అత్తిబెళ ప్రాంతంలో మరో వ్యక్తితో ఉన్నట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబ సలహా కేంద్ర సభ్యురాలు అపర్ణ ఎదుట హాజరుపరియారు. భర్తను జైలుకు పంపేందుకు తానే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆమె అంగీకరించింది. తన భర్తతో కాపురం చేయనని, ప్రియుడితోనే ఉంటానని ఆమె చెప్పడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: గుంటూరు: అప్పు తీర్చడం లేదని.. ట్రాక్టర్తో తొక్కించి గిరిజన మహిళ దారుణ హత్య
Also Read: భర్తను చితకబాది.. భార్యను పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కర్నూలు జిల్లాలో దారుణం
దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు అపర్ణ పూర్ణేశ్ ఆమె భర్త ఫోన్ సేకరించి అతడిని విచారించారు. పది రోజులుగా తన భార్య కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని అతడు చెప్పడంతో వారు షాకయ్యారు. లోతుగా విచారణ చేపట్టగా ఆమె గుట్టు బయటపడింది. కొంతకాలం ఆమె తన స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకుని తరుచూ ఛాటింగ్ చేసుకుంటూ, కాల్స్ చేసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకు వీరి స్నేహం ప్రేమగా మారి కలిసి జీవించాలనుకున్నారు.
Also Read: రెండో భర్త సాయంతో ప్రియుడి మర్డర్.. గుంటూరు వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
పది రోజుల క్రితం ఆమె భర్త, బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అత్తిబెళ ప్రాంతంలో మరో వ్యక్తితో ఉన్నట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబ సలహా కేంద్ర సభ్యురాలు అపర్ణ ఎదుట హాజరుపరియారు. భర్తను జైలుకు పంపేందుకు తానే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆమె అంగీకరించింది. తన భర్తతో కాపురం చేయనని, ప్రియుడితోనే ఉంటానని ఆమె చెప్పడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: గుంటూరు: అప్పు తీర్చడం లేదని.. ట్రాక్టర్తో తొక్కించి గిరిజన మహిళ దారుణ హత్య