యాప్నగరం

మరో మహిళతో అక్రమ సంబంధం.. భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య

భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తున్న భార్య ఆదివారం ఉదయం నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసి పారిపోయింది.

Samayam Telugu 13 Feb 2020, 3:14 pm
తనను పట్టించుకోకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య ప్రతీకారం తీర్చుకుంది. మరుగుతున్న వంటనూనె అతడిపై పోసి పిల్లలతో సహా పరారైంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది.
Samayam Telugu hot-oil-1


Also Read: హోటల్ యజమాని కూతురితో ప్రేమాయణం.. కోరిక తీర్చుకుని పరారైన ఆటోడ్రైవర్

బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మంజునాథ్(40)‌కు తొమ్మిదేళ్ల క్రితం పద్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం యశ్వంత్‌పూర్‌లోని మోహన్‌కుమార్ నగర్‌లో నివాసముంటున్నాడు. అయితే మంజునాథకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని భార్య తరుచూ అనుమానిస్తూ ఉంటుంది. ఇదే విషయంపై దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: భీమవరంలో యువకుడి కిడ్నాప్.. టీడీపీ ఎంపీ గన్‌మెన్‌పై ఆరోపణలు

ఆదివారం ఉదయం నిద్రలేచిన పద్మ వంటకు వినియోగించే నూనె గిన్నెలో పోసి సలసల కాగేలా మరిగించింది. దాన్ని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి నిద్రపోతున్న భర్తపై పోసింది. తీవ్రగాయాలతో అతడు కేకలు పెడుతుండగానే పిల్లలను తీసుకుని పారిపోయింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. సుమారు 50శాతం శరీరం కాలిపోవడంతో అతడు బాధతో విలవిల్లాడుతున్నాడు. మంజునాథ్‌కు ప్రాణాపాయం లేదని, కోలుకోవడానికి మాత్రం ఎక్కువ సమయమే పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసుల పద్మ కోసం గాలిస్తున్నారు.

Also Read: ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.