యాప్నగరం

మద్యం తాగొద్దన్నందుకు భార్యపై కక్ష.. మరిగే నూనె పోసిన భర్త

తాగుడు మానమన్నందుకు భార్యపై కక్షగట్టాడో భర్త. ఆమె నిద్రపోతున్న సమయంలో సలసల మరిగే నూనె శరీరంపై పోసి పరారయ్యాడు. ఆమెకు 40శాతం గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు.

Samayam Telugu 27 Mar 2020, 5:39 pm
Samayam Telugu 10woman
కుటుంబ కలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో రాజధాని భోపాల్‌లో వెలుగుచూసింది. భీమ్‌నగర్‌‌కు చెందిన బంటీ శాక్య అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన గీత(32)తో 2008లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.

Also Read: పక్కింటి ఆంటీపై కన్నేసిన యువకుడు.. భర్తలేని సమయంలో మంచానికి కట్టేసి రేప్

లాక్‌డౌన్ సందర్భంగా కొద్దిరోజులుగా దంపతులిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా మద్యం స్టాక్ తెచ్చుకున్న శాక్య రోజూ తాగి భార్యతో గొడవపడుతున్నాడు. మూడురోజులు ఇది మరింత శ్రుతి మించింది. బుధవారం రాత్రి కూడా శాక్య తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం గీత పిల్లలతో ఓ గదిలో పడుకోగా.. అతడు మరో గదిలో పడుకున్నాడు. గురువారం తెల్లివారుజామున నిద్రలేచిన అతడు కిచెన్‌లో వంటనూనె వేడిచేసి భార్యపై పోసేశాడు. ఆమె కేకలు వేయడంతో కుటుంబసభ్యులందరూ మేల్కొన్నారు.

Also Read: కరోనా భయంతో దంపతుల ఆత్మహత్య... రాజమండ్రిలో కలకలం

ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గీతను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 40శాతం గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జహంగీరాబాద్ పోలీసులు ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న శాక్య కోసం గాలింపు చేపట్టారు.

Also Read: ప్రియుడి కారణంగా బిడ్డను కన్న వివాహిత.. శిశువును మూటకట్టి బావిలో పడేసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.