యాప్నగరం

బాలికను కారులో కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్.. 3 గంటల పాటు నరకం

భోపాల్‌ నగరంలో 17ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 22 Apr 2020, 1:43 pm
లాక్‌డౌన్ సమయంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని ఓ వైపు పోలీసులు చెబుతుంటే మరోవైపు మాత్రం మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక భోపాల్‌‌లో నమోదైన రెండో రేప్ కేసు ఇది. ఏప్రిల్ 18న గోవింద్‌పూర్‌లోని జేపీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 17ఏళ్ల బాలిక నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆమెను గమనించిన ఇద్దరు కామాంధులు భెల్ టౌన్‌షిప్ వద్ద అడ్డగించి కారులోకి లాగారు. ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను కిడ్నాప్ చేసి నిందితులు కారులో 8 కిలోమీటర్లు ప్రయాణించినా ఎక్కడా పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం.
Samayam Telugu rape3


Also Read: మరదలిపై కామం.. డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన బావ

అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలేసిన కామాంధుడు కారులో పరారయ్యారు. ఈ విషయాన్ని బాలిక తన స్నేహితురాలికి చెప్పగా ఆమె సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను షఫీక్ ఖాన్, అబిద్ ఖాన్ అనే వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి రేప్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోక్సో చట్టం కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవింద్‌పూర్ పోలీసులు కేసును హబీబ్‌గంజ్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని భోపాల్ ఏఎస్పీ(జోన్-1) రజత్ సక్లేచా తెలిపారు.

Also Read: ప్రియుడితో సెక్స్ చేస్తుండగా విసిగించాడని.. కన్నబిడ్డను చంపేసిన కిరాతకురాలు

భోపాల్‌ ఈ నెల 17వ తేదీన దృష్టి లోపం ఉన్న మహిళా బ్యాంక్ మేనేజర్‌(53)పై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. లాక్‌డౌన్ కారణంగా భర్త వేరే ప్రాంతంలో ఇరుక్కుపోవడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక్కరోజు వ్యవధిలోనే రెండు అత్యాచార ఘటన జరగడంతో భోపాల్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

Also Read: కాపురంలో లాక్‌డౌన్‌ చిచ్చు... భర్త ఎడబాటు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.