పేరుకు ఉన్నత విద్యావంతుడు.. సివిల్ ఇంజినీర్గా ఉద్యోగం వెలగబెడుతున్నాడు. శాడిజానికి, పైశాచికత్వానికి చదువు, బుద్ధితో పనేముందని అనుకున్నాడో.. ఏమో గానీ కట్టుకున్న భార్యకు ‘అగ్ని పరీక్ష’ పెట్టాడు. ‘‘మొదట నిప్పుల్లో నడువు. ఒకవేళ కాళ్లు కాలకపోతే నిన్ను భార్యగా అంగీకరిస్తా’’ అంటూ శాడిజం ప్రదర్శించాడు. భయం వేసి ఆమె తిరస్కరించడంతో దారుణంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించింది.
Also Read: గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త.. చివరకు?
బిహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. 2009లో సురేంద్ర బింద్తో బాధిత మహిళకు వివాహమైంది. అప్పుడు బాధిత మహిళే చిన్నచొన్న ఉద్యోగాలు చేసేది. పెళ్లయిన ఐదేళ్ల వరకు వీరి సంసారం హాయిగానే సాగింది. అయితే 2014లో సురేంద్రకు ఉద్యోగం వచ్చింది. అప్పటి అతడిలో మార్పు మొదలైంది. ఇంటి నుంచి వెళ్లిపోవాలని బాధిత మహిళను వేధించసాగాడు. ‘‘నీవంటి చదువు లేని, దరిద్రమైన మహిళతో కలిసి జీవించలేను’’ అంటూ రోజూ హింసించసాగాడు.
ఇంటి నుంచి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో ‘అగ్ని పరీక్ష’ అంటూ పైశాచికత్వం ప్రదర్శించి, తీవ్రంగా కొట్టి, ఇంటి నుంచి గెంటి వేశాడు. బాధిత మహిళ మాట్లాడుతూ.. ఉద్యోగం వచ్చిన తర్వాత తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనను ఇలా వేధిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
Also Read: పాలమూరు సీరియల్ కిల్లర్: కల్లు కాంపౌండ్లో కడియాలతో కనిపిస్తే ఖతమే..!
Also Read: గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త.. చివరకు?
బిహార్ రాష్ట్ర రాజధాని పట్నాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. 2009లో సురేంద్ర బింద్తో బాధిత మహిళకు వివాహమైంది. అప్పుడు బాధిత మహిళే చిన్నచొన్న ఉద్యోగాలు చేసేది. పెళ్లయిన ఐదేళ్ల వరకు వీరి సంసారం హాయిగానే సాగింది. అయితే 2014లో సురేంద్రకు ఉద్యోగం వచ్చింది. అప్పటి అతడిలో మార్పు మొదలైంది. ఇంటి నుంచి వెళ్లిపోవాలని బాధిత మహిళను వేధించసాగాడు. ‘‘నీవంటి చదువు లేని, దరిద్రమైన మహిళతో కలిసి జీవించలేను’’ అంటూ రోజూ హింసించసాగాడు.
ఇంటి నుంచి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో ‘అగ్ని పరీక్ష’ అంటూ పైశాచికత్వం ప్రదర్శించి, తీవ్రంగా కొట్టి, ఇంటి నుంచి గెంటి వేశాడు. బాధిత మహిళ మాట్లాడుతూ.. ఉద్యోగం వచ్చిన తర్వాత తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనను ఇలా వేధిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
Also Read: పాలమూరు సీరియల్ కిల్లర్: కల్లు కాంపౌండ్లో కడియాలతో కనిపిస్తే ఖతమే..!