యాప్నగరం

మెడకు తాడు బిగించి.. హైదరాబాద్‌లో బీహార్ వ్యక్తి దారుణహత్య

బిహార్‌కు చెందిన అజిత్ హైదరాబాద్ శివారు మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని కొందరు దుండగులు అతికిరాతకంగా చంపేశారు.

Samayam Telugu 24 Apr 2020, 2:31 pm
హైదరాబాద్ నగరంలో దారుణహత్య జరిగింది. బీహార్‌కు చెందిన వ్యక్తిని కొందరు దుండగులు మెడకు తాడు బిగించి అతికిరాతకంగా చంపేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద కొందరు దుండగులు ఓ వ్యక్తిని తాడుతో మెడకు ఉరి బిగించి అత్యంత కిరాతకంగా చంపేశారు. రైలు పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
Samayam Telugu suicides


Also Read: పెళ్లి చేయడం లేదని కన్నవాళ్లనే చంపేశాడు.. తమిళనాడులో దారుణం

మృతుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన అజిత్‌గా పోలీసులు గుర్తించారు. అతడు నగర శివారులోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడని, రెండ్రోజులుగా కనిపించడం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చివరికి అతడు విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: తెలంగాణలో రౌడీషీటర్ దారుణహత్య.. తలని వేరుచేసి అత్యంత కిరాతకంగా

అజిత్ హత్య వెనుక కంపెనీ యజమాని హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజిత్ పనిచేసే కంపెనీ యజమానికి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘గదికి రమ్మంటున్నాడు’ ముంబయి పోలీస్‌పై విదేశీ మహిళ ఫిర్యాదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.