యాప్నగరం

రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న భర్త.. కారణం విని షాకైన మొదటి భార్య

కొంతకాలం క్రితమే రెండో పెళ్లి చేసుకున్న తన భర్త మరోచోట కాపురం పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆమె భర్తను నిలదీసింది.

Samayam Telugu 12 Dec 2019, 4:02 pm
కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. మొదటి భార్యను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ముఖేశ్ షా అనే వ్యక్తికి 2012లో ఓ యువతితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లి సమయంలో ముఖశ్ కుటుంబం రూ.5లక్షలు డిమాండ్ చేయగా.. వధువు తరఫువారు రూ.3లక్షలు మాత్రమే కట్నంగా ఇచ్చారు.
Samayam Telugu wedding


Also Read: ప్రియురాలిని చంపి, శవాన్ని ముక్కలుగా నరికి... జిమ్ యజమాని పైశాచికం

దీంతో పెళ్లయినప్పటి నుంచి ముఖేశ్ అదనపు కట్నం కోసం భార్యను వేధించేశాడు. ఇటీవల అతడు సరిగ్గా ఇంటికి రాకపోవడంతో పాటు ప్రవర్తనలోనూ తేడా కనిపించడంతో భార్య నిఘా పెట్టగా షాకింగ్ విషయం తెలిసింది. కొంతకాలం క్రితమే రెండో పెళ్లి చేసుకున్న అతడు మరోచోట కాపురం పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆమె భర్తను నిలదీసింది. అయితే దీనికి అతడు చెప్పిన కారణంతో మరోసారి షాకైంది.

Also Read: గర్భవతిని చేసి పెళ్లికి నో చెప్పిన ప్రియుడు.. కామాంధుడికి పదేళ్ల జైలు

పెళ్లి సమయంలో తనకు రూ.2లక్షలు తక్కువగా కట్నం ఇచ్చారని, ఆ డబ్బు కోసమే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై మోసం, వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లో అడుగుపెట్టాలని అత్తమామలు సైతం వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది.

Also Read: టెన్త్ క్లాస్ బాలికపై బీహారీల అఘాయిత్యం.. తీవ్ర రక్తస్రావం కావడంతో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.