యాప్నగరం

భార్యను చంపి బీహార్‌కు పరార్.. చౌటుప్పల్‌లో దారుణ ఘటన

గురువారం సింటు కుమార్ పనికి రాకపోవడంతో కాంట్రాక్టర్ ఫోన్ చేశాడు. అతడు ఎత్తకపోవడంతో ఓ వ్యక్తిని ఇంటికి పంపించి చూడమన్నాడు. ఇంట్లో అతడి భార్య విగతజీవిగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Samayam Telugu 24 Jan 2020, 1:54 pm
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యను అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. బిహార్‌‌లోని కాగారియా జిల్లా మరర్‌ ప్రాంతానికి చెందిన సంగీత కుమారి(23), సింటుకుమార్‌ దంపతులు ఉపాధి కోసం కొంతకాలం క్రితం మూడేళ్ల కూతురితో కలిసి చౌటుప్పల్‌కు వలస వచ్చారు. సింటుకుమార్‌ లేబర్‌ గుత్తేదారు సహకారంతో ఇక్కడి పరిశ్రమలో కూలీగా చేరాడు.
Samayam Telugu murder


Also Read: మహిళ కోసం ఘర్షణ.. తాజా భర్త చేతిలో మాజీ భర్త హత్య

ఇటీవల అక్కడ పనిమానేసి శ్రీ ఐశ్వర్య రిఫైనరీ ఆయిల్‌ మిల్‌ పరిశ్రమలో చేరాడు. గురువారం పనికి వెళ్లకపోవడంతో కాంట్రాక్టర్ సింటుకుమార్‌‌కి ఫోన్ చేశాడు. ఆయన కాల్ ఎత్తకపోవడంతో ఓ వ్యక్తిని అతడి ఇంటికి పంపించాడు. ఇంట్లో సంగీతకుమారి విగతజీవిగా పడి ఉండటంతో ఆ వ్యక్తి కంగారు పడి వెంటనే కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతో చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: ‘నాతో కాపురం చేసింది చాలు.. నా తండ్రిని కూడా సుఖపెట్టు’.. భర్త మాటలతో షాకైన మహిళ

సింటుకుమార్‌ కనిపించకపోవడంతో అతడే భార్యను చంపేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు. కూతురు కూడా కనిపించకపోవడంతో ఆమెను తీసుకుని పరారైనట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీ ఐశ్వర్య ఆయిల్‌ మిల్‌ పరిశ్రమ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌ ఠాకూర్‌ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: సికింద్రాబాద్‌లో ప్రేమోన్మాదం.. బాలికను భవనంపై నుంచి తోసేసి దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.